‘సింహా’. ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నట సింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్నహ్యాట్రిక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఫస్ట్ షాట్లోనే ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘’అనే పవర్ఫుల్ డైలాగ్ను తనదైన స్టైల్లో చెప్పారు నట సింహ నందమూరి బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.