ఎన్నో రోజుల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండడంతో అంతటా అజ్ఞాతవాసి హడావిడి నడుస్తుంది. గత రాత్రి ప్రీమియర్ షోలతో పాటు కొన్ని బెనిఫిట్ షోస్ పడ్డాయి. ఓవర్సీస్లోను భారీ సంఖ్యలో షోస్ ప్రదర్శితమవుతున్నాయి. ఇక అభిమానులు థియేటర్స్ దగ్గర భారీ హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్ని బట్టి అజ్ఞాతవాసి చిత్రం రికార్డులు కొల్లగొట్టనుందని అభిమానులు అంచనాకి వచ్చారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో అజ్ఞాతవాసిపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.
అందరు ఊహించినట్టుగానే అజ్ఞాతవాసి చిత్రం అభిమానులని ఎంతగానో అలరిస్తుందని తెలుస్తుంది. పవన్ ఫ్యాన్స్తో పాటు వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ట్విట్టర్ వేదికగా సినిమాకి సంబంధించిన అప్డేట్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా.. మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు చిత్రానికి నాలుగు స్టార్స్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ఎక్స్ట్రార్డినరీగా ఉందని చెబుతూ, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ డైరెక్షన్, టెర్రిఫిక్ స్టోరీ , స్క్రీన్ప్లే అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. ఈ సంక్రాంతికి అజ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించడం ఖాయమని అభిమానులు చెప్పుకుంటున్నారు. బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటూ పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్రని త్రివిక్రమ్ అద్భుతంగా మలచాడంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పవన్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అజ్ఞాతవాసి చిత్రంతో త్రివిక్రమ్- పవన్ కాంబో హ్యట్రిక్ కొట్టారని టాక్. సినిమాకి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం కొద్ది గంటలు ఆగాల్సిందే.