హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం అరణ్య సినిమాలో నటిస్తున్నారు. హిందీ మరియు తెలుగు భాషలలో ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. అలాగే తెలుగులో సాయి పల్లవి హీరోయిన్ గా విరాట పర్వం మూవీలో కూడా ఆయన నటిస్తున్నారు.అయితే గుణశేఖర్ దర్శకతంలో హిరణ్య కశిప చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం రానా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే మొదలుకావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వలన వాయిదాపడుతూ వస్తుంది. ఈ ఏడాది చివర్లో హిరణ్య కశిప సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఐతే పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్క నున్న ఈ చిత్ర బడ్జెట్ అనుకున్న దానికంటే దాదాపు సగానికి తగ్గించారట. మొదట్లో 180కోట్ల వరకు హిరణ్య కశిప సినిమాకు కేటాయించగా దానికి 100 కోట్లకు కుదించారని తెలుస్తుంది. దర్శకుడు గుణశేఖర్ పై నమ్మకం లేకనో మరి, పౌరాణిక గాథ అందరు ఇష్టపడరనో…కారణం ఏదైనా హిరణ్య కశిప బడ్జెట్ మార్పులు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.