ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై తనకున్న ప్రేమను స్పెషల్ గా తెలియజేశాడు ప్రిన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 11:33 AM



మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్‌.. టాలీవుడ్ లో చూడముచ్చటైన జంటల్లో ఒకరు. వీరిద్దరు కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా. ‘వంశీ’ సినిమా జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజ జీవితంలోనూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించారు. ఈరోజు నమ్రత గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్యపై తనకున్న ప్రేమను స్పెషల్ గా తెలియజేశాడు ప్రిన్స్.సూపర్‌ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలియజేసి అందరి ద్రుష్టి ని ఆకర్షించాడు..ఈ సందర్భంగా చూడచక్కని ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేశారు. మహేష్‌బాబు అభిమానులు ఈ ఫొటోతో ఖుషీ అయ్యారని చెప్పొచ్చు. ఈ ఫొటోను షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.


అభిమానులైతే ఈ పిక్స్ చూసి తెగ సంబర పడుతున్నారు. వయసు పెరిగిన కొద్దీ మహేష్ అందం రెట్టింపు అవుతుందని వారు కామెంట్స్ వేస్తున్నారు.వంశీ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌ గా నటించిన నమ్రతతో షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డాడు సూపర్‌ స్టార్‌.కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటైయ్యారు. 2005లో ఫిబ్రవరి 10న మహేష్ – నమ్రతలకు పెళ్ళయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు.. గౌతమ్‌, సితారలు..పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రత కుటుంబ బాధ్యతలతో పాటు మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు.


షూటింగ్ లతో ఎంత బిజీ గా ఉన్న కానీ తన ఫ్యామిలీ తో గడిపేందుకు ఎప్పుడు ముందుంటాడు మహేష్. ఆయనకి కొంచెం సమయం దొరికినా పిల్లలతో హ్యాపీగా విహరిస్తుంటారు.


మహేష్, పిల్లల ఫోటోలని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంటారు నమ్రత.ఈ రోజు నమ్రత పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్‌ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కైరా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.త్వరలో వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్ 25 వ సినిమా సెట్స్‌కెళ్ల‌నుంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళుతోంది. ఇప్ప‌టికే న్యూయార్క్‌లో లొకేష‌న్ల వేట సాగించార‌ని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com