అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ వచ్చిన తరవాత కూడా త్రివిక్రమ్ తో తాను ఇచ్చిన కమిట్మెంట్ ని పక్కకి పెట్టకుండా,తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయకుండా ఎన్టీఆర్ తన ఇరవై ఎనిమిదవ సినిమా కంటిన్యూ అవ్వడం విశేషం అనే చెప్పాలినిజానికి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తలచుకుంటే ఇప్పటికిప్పుడే హారిక హాసిని వాళ్లకి తన డేట్ లు క్యాన్సిల్ చేసుకుని , అడ్వాన్స్ చెక్కులు వెనక్కి ఇచ్చేసి అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమాను వంకగా చూపించి బయటకి వెచ్చేయచ్చు. కానీ మాటమీద నిలబడే వ్యక్తిగా ఫాన్స్ చెప్పుకునే ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ కి ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు.
ఎన్టీఆర, త్రివిక్రమ్ ల కాంబినేషన్ అంటే అందరూ ఒక రేంజ్ ఫామిలీ ఎంటర్టైనర్ ని ఊహిస్తున్నారు. మరి ఈ పరిస్థితి లో ఈ సినిమా నెలాఖరు నుంచీ సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ ఇద్దరు హీరోయిన్ లతో రోమాన్స్ చెయ్యాల్సి ఉంది.
ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే ని అనుకుంటున్నారు. మొదట్లో ఇదే రోల్ కి అనూ ఇమాన్యుయల్ పేరు వినపడింది కానీ అజ్ఞాతవాసి ప్లాప్ తో ఆమెని తప్పించారు. రీసెంట్ గా నాగ శౌర్య తో చలో మూవీ తో హిట్ కొట్టిన రశ్మిక మీద హీరో ఎన్టీఆర్ కన్ను పడినట్టు గా చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ ఈ హీరోయిన్ తెగ నచ్చేస్తోంది.దీంతో తన సినిమాతోనే బ్రేక్ ఇద్దామని ఎన్టీఆర్ కూడా ఫీల్ అవుతున్నాడట. నటన, లుక్స్ లో క్యూట్ గా ఉండడం ఈ హీరోయిన్ కి పెద్ద అసెట్ .మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్స్ విషయమై అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్, రష్మిక మండన్నా ని సజెస్ట్ చేసాడు అనడం కేవలం రూమరంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
చూద్దాం ఒక సినిమా హిట్ అనగానే ఆ హీరోయిన్ కి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అని న్యూస్ రావడం సర్వసాధారమైపోయింది. మరి ఇప్పుడు రష్మిక మండన్నా విషయంలోనూ అదే జరిగింద లేదంటే నిజంగానే ఎన్టీఆర్ పక్కన ఆఫర్ రష్మికకి వచ్చిందో చూద్దాం.