వెటరన్ యాక్టర్ రణ్దీర్ కపూర్.. జవానీ దివానీ, హౌజుఫుల్ 2, యాక్షన్ రిప్లే వంటి చిత్రాలతో స్టార్డం అందుకున్న సంగతి తెలిసిందే. రాజ్కపూర్ తనయుడిగా వెండితెర ఆరంగేట్రం చేసిన రణ్దీర్ ఆనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇద్దరు కూతుళ్ళు కరీనా కపూర్, కరీష్మా కపూర్లు బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్నారు . నిన్న రణ్దీర్ తన 71వ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాడు. కపూర్ సిస్టర్స్ ముంబైలోని ఖర్ ప్రాంతంలో ఉన్న చిన్న గార్డెన్ రెస్టారెంట్లో తన తండ్రి బర్త్డే ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసారు. దాదాపు కపూర్ ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీకి హాజరు కాగా, బబిత కేక్ కట్ చేసి రణ్దీర్కి తినిపించడం పిక్స్లో చూడవచ్చు. ఇక కేక్పై రణ్ధీర్ గ్రాండ్ చిల్డ్రన్స్ తైమూర్, సమైరా, కియాన్ పేర్లు కూడా కనిపించడం విశేషం. కరీష్మా కపూర్ తన ఇన్స్ట్రాగ్రామ్లో లవ్యూ పప్పా అనే క్యాప్షన్తో పలు ఫోటోలని షేర్ చేసింది. వాటిపై మీరు ఓ లుక్కేయండి.