జ్యోతిక త్వరలో రేడియో జాకీగా అవతారం ఎత్తనున్నారు. రేడియోలో తన అభిమానులతో ప్రతి రోజూ అర్ధరాత్రిపూట మాట్లడనున్నారు. ఈ అవతారం ఏంటీ అనుకుంటున్నారా? ...గత ఏడాది సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న చిత్రం 'తుమ్హారీ సులు'. ఈ సినిమాలో విద్యాబాలన్ కీలక పాత్రలో నటించారు. రేడియో జాకీగా చేస్తూ రాత్రిపూట ఆలస్యంగా ఇంటికొచ్చే గృహిణిగా పాత్రలో ఈ సినిమాలో చేసింది. హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యాబాలన్ పాత్రను జ్యోతిక పోషించనున్నారు. రాధా మోహన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. మణిరత్నం, విక్రమ్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా పనుల్లో రాధామోహన్ బిజీగా ఉన్నారు. 'తుమ్హారీ సులు' రీమేక్ చిత్రం జూన్లో సెట్స్పైకి వెళ్లనుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.