సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై సినీనటి శ్రీసుధ మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసున్న తర్వాత ఇప్పుడు కాదంటున్నాడంటూ గతేడాది శ్రీసుధ ఎస్సార్నగర్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ మరోమారు ఎస్సార్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మాదాపూర్లోని తన నివాసానికి పిలించాడని..స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నా తనను దూషించాడని ఫిర్యాదులో శ్రీసుధ పేర్కొన్నారు. అంతేకాకుండా శారీరకంగానూ దాడి చేశారని ఆరోపించింది. శ్యాం కె నాయుడు కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. శ్రీసుధ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేయనున్నట్టు చెప్పారు.