2020లో భారతీయ సినీపరిశ్రమకు చెందిన ఎందరో నటులు పెళ్లిపీటలెక్కారు. ఓ ఇంటి వారయ్యారు. టాలీవుడ్ లో అయితే పెళ్లి భాజాలు గట్టిగానే మోగాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం సింగర్ నేహా కక్కర్ పెళ్లి మాత్రమే జరిగింది. టాలీవుడ్ లో నిఖిల్, రానా, నితిన్ వంటి స్టార్ హీరోల వివాహాలు జరిగాయి. నిహారిక, కాజల్ వంటి వారి విహహాలు కూడా గత ఏడాది జరిగాయి. ఇకపోతే సింగర్ సునీత పెళ్లి ఈ ఏడాదిప్రారంభంలోనే జరిగింది. అయితే ఇప్పడు ఓ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలైన నటాషా దలాల్ను వివాహాం చేసుకోబోతోన్నాడు.
నటాష ప్రస్తుతం ముంబైలోనే ఫ్యాషన్ డిజైనర్గా పని చేస్తోంది. జనవరి 24న జరగబోతోన్న ఈ వివాహా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా అలీభాగ్కు బయల్దేరారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అలియా భట్, కత్రినా, రణ్ బీర్ కపూర్ వంటి వారంతా హాజరు కాబోతోన్నట్టు తెలుస్తోంది. వరుణ్ ధావన్ చివరగా కూలీ నెంబర్ వన్ చిత్రంతో పలకరించాడు. ఈ జంట వివాహం తర్వాత బాలీవుడ్ల్ రణ్బీర్ కపూర్, అలియా భట్ వివాహాం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.