తమిళ హిట్ చిత్రం ‘సుందర ట్రావెల్స్’ చిత్రంలో నటించిన నటి రాధ(39) తన భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నూర్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తన భర్త వసంతరాజ వేధిస్తున్నాడని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని, హింసిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తనను కొట్టి హింసిస్తున్నాడని వసంతరాజపై రాధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.