మెగాస్టార్ చిరంజీవి , మహేష్ బాబు , ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేసారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. కానీ ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం ఉండే అవసరం లేదు . ఈద్ సందర్భంగా సెలబ్రిటీలు అందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో అందరికి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం అందించాలని అల్లా ను కోరుకుంటున్నాను. అలానే ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మానవాళికి అన్ని బాధలు తొలగిపోవాలని ఆశిస్తున్నాను అని చిరు పేర్కొన్నారు. ఇక మహేష్ బాబు అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ .. ఈద్ అందరికి శాంతి, ఆనందం అందిస్తుందని భావిస్తున్నాను అని ట్వీట్ చేశారు.