ఇటీవల కరోనా బారిన పడిన రకుల్ ఆ వైరస్ నుంచి కోలుకున్న సంగతి తెలసిందే. ఇప్పుడు కరోనా బారిన పడి ఇబ్బందలు పడుతున్న వారికి సాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. దీంతో ఆక్సిజన్ లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాటి వారిలో ఏ కొంతమంది ప్రాణాలైనా రక్షించేందుకు నడుంబిగించింది. ఇందులోభాగంగా ఆమె, కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తన వంతుగా కొంత సొమ్ము సమకూర్చిన రకుల్... తన స్నేహితులు ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరించి ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది రకుల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ప్రతిఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.