సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్.ఆ తర్వాత అఖిల్తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. తన ఇస్మార్ట్ అందాలతో ఇప్పుడు రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళనాట ప్రస్తుతం హాట్ హీరోయిన్ అయిపోయింది నిధి.అయితే మొదటి సినిమాతోనే తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఎందుకు ఆశించినంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే ఇప్పుడు ఆలస్యంగా అయినా నిధి అగర్వాల్ కు వరుసగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాల్లో మంచి అవకాశం దక్కించుకుంది ఈ భామ. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు ఛాన్స్ దక్కినట్లు టాక్.