పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ల దాంపత్యంలో వారికి ఇద్దరు పిల్లలు జన్మించగా ఆ పిల్లలిద్దరికి అకీరా, ఆద్య అనే పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే . ప్రసుతం పవన్.. రేణూకు దూరంగా ఉంటున్న కూడా వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు అనే సమాచారం ఉంది . మార్చి 23న ఆద్యా బర్త్ డే కావడంతో గత ఏడాది ఇదే రోజున పూణేకి వెళ్ళాడు పవన్ . ఆద్యా ఏడో బర్త్డే వేడుకలలో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఆద్యా తో పాటు ఈ చిన్నారి ఫ్రెండ్స్ తోను పవన్ సరదాగా గడిపాడు. ఆద్యాతో పవన్ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోస్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ ఈ సారి మాత్రం ఆద్యా ఎనిమిదో బర్త్డే వేడుకకి హాజరు కానట్టు తెలుస్తుంది. పవన్ అభిమానులు మాత్రం పాత ఫోటోస్నే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఆద్యాకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఆ చిన్నారి భవిష్యత్లో మరింత ఎత్తుకు ఎదగాలని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ చిన్నారి మాత్రం తన బర్త్డే రోజున తండ్రిని మిస్ కావడం బాధాకరం అంటున్నారు.