నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస ఆఫర్స్తో దూసుకుపోతుంది. రీసెంట్గా అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. బుధవారం చిత్ర షూటింగ్ పూర్తి కాగా, మే 9న మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో బయోపిక్లోను కీర్తి నటించనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆనందో బ్రహ్మా చిత్రంతో మంచి విజయం సాధించిన మహి రాఘవ వైఎస్ బయోపిక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. 30 కోట్ల బడ్జెట్తో వైఎస్ బయోపిక్ రూపొందనుందని తెలుస్తుండగా, ఇందులో వైఎస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలని చూపించనున్నారని సమాచారం. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేష్ నటించనుందట. ఇప్పటికే కీర్తిని సంప్రదించి పాత్ర గురించి వివరించారట మేకర్స్. ఈ పాత్రకి ఇంప్రెస్ అయిన కీర్తి వైఎస్ బయోపిక్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. జగన్ పాత్రని సూర్య పోషించనున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ లేదు. యాత్ర అనే టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రం మేలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సెప్టెంబర్ చివరిలో సినిమా రిలీజ్ కానుందని టాక్.