మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మాస్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే అనే సంగతి తెలిసిందే..మెగా స్టార్ చిరంజీవి తో వస్తున్న ఆ ఫ్యాన్స్..అల్లు శిరీష్ వరకు ఫ్యాన్స్ అయ్యారు..ఇక రామ్ చరణ్ పబ్లిసిటీ సంబదించిన వ్యవహారాలు చూసుకోవడానికి, నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో తన కవరేజ్ కోసం ఓ ముంబాయి సంస్థకు బాధ్యతలు అప్పగించాడు. అయితే తాజాగా ఆ సంస్థ కు చరణ్ బై బై చెప్పినట్లు తెలుస్తుంది..దీనికి కారణం పలు ఉన్నాయని ప్రచారం అవుతున్నాయి..ఆ సంస్థ చేసేది తక్కువ వేసే బిల్లులు ఎక్కువని కొంతమంది అంటుంటే..మరికొంతమంది ఆ సంస్థ పెద్దగా పబ్లిసిటీ చేయడం లేదని అంటున్నారు. చరణ్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం ఆ సంస్థ తో చరణ్ కు పనిలేదని ఒకవేళ రంగస్థలం సినిమా రిలీజ్ టైం లో వారిని తీసుకుంటే తీసుకోవచ్చని అంటున్నారు.