కొంత కాలం క్రితం టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా మారిన విషయం అఖిల్ ఎంగేజ్ మెంట్ మేటర్. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్దం జరిగాక వీరి పెళ్ళిపై పలు వార్తలు పుట్టుకొచ్చాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో అఖిల్, శ్రియా భూపాల్ మ్యారేజ్ ఇటలీలో జరగనుందని చెప్పుకొచ్చారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని అన్నారు. కాని ఏం జరిగిందో ఏమో కాని చివరి నిమిషంలో అఖిల్, శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన పెళ్లి కి బ్రేక్ పడిందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి. దీనిపై అటు అఖిల్ కుటుంబ సభ్యులు కాని ఇటు శ్రేయ ఫ్యామిలీ కాని స్పందించలేదు.
శ్రేయ భూపాల్ రీసెంట్గా ఉపాసన కజిన్ అయిన అనిందిత్ రెడ్డితో నిశ్చితార్ధం జరుపుకుంది. ఈ వేడుకకు రామ్చరణ్, ఉపాసనలతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గతంలోనే వీరి వివాహంకి సంబంధించి పలు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ లేదు. కాని తాజాగా శ్రియాభూపాల్ బంధువు పింకీ రెడ్డి వీరి నిశ్చితార్ధంకి సంబంధించిన ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో అందరికి ఓ క్లారిటీ ఇచ్చింది. అనిందిత్ అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవడు, చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు కాగా ప్రస్తుతం ఈయన దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్ లో పని చేస్తున్నట్టు సమాచారం. అనిందిత్ తల్లి సంగీత, ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెళ్లు. అనిందిత్- శ్రియా భూపాల్ల వివాహం పారిస్లో జరగనున్నట్టు సమాచారం.