యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ ‘సినిమా’ చేస్తున్నాడు. పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ కు కూడ మంచి స్పందన దక్కింది. దీంతో చిత్ర ప్రమోషన్ల వేగాన్ని పెంచిన టీమ్ ఆడియోలోని మొదటి పాట ‘సౌందర్య లహరి’ని విడుదలకు రెడీ చేసింది.రేపు శుక్రవారం ఈ పాట విడుదలకానుంది. మంచి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలోని కొన్ని పాటల్ని విదేశాల్లోని ఖరీదైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది. అభిషేక్ నామ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుండగా ఆర్థర్ ఏ విల్సన్, పీటర్ హెయిన్స్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.