బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ’జయజానకినాయక’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యాజైశ్వాల్, నందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి మాట్లాడుతూ జయజానకినాయక’ సినిమా ఆగస్ట 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు బోయపాటిగారు చేసిన సినిమాలన్నింటిలో ’జయజానకినాయక’ బెస్ట మూవీ అని చెప్పగలను. ఈ సినిమాలో మంచి లవ్స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఆడియెన్స్కు కావాల్సిన యాక్షన్ ఉన్నాయి. సినిమాకు మంచి కథ కుదరడమే తొలి సక్సెస్. సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు సూపర్హిట్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. జయజానకినాయక కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఓ ఫ్యామిలీలా కలిసి పోయాం. ఈ సినిమాలో గ్లామరస్ రోల్ చేశానని ప్రగ్యా జైశ్వాల్ తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో జానకి క్యారెక్టర్ దొరకడం నా అదౄఎష్టం. ఇంత పెద్ద ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ చేయగలనని నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శకుడు బోయపాటిగారికి నా కౄఎతజ్ఞతలు అని అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని సినిమాలలో ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటాం. అలా నా కెరీర్ ప్రారంభంలో ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది. సినిమా నేడే గ్రాండ్ రిలీజ్ అవుతోంది.. భద్ర తర్వాత నేను చేసిన బ్యూటీఫుల్ లవ్స్టోరీ. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్ని కలగలిసిన స్క్రిప్ట్స దొరకడం చాలా ఆరుదు. ఎ,బి, సి సెక్షన్ ఆడియెన్స్ ఓకే వరుసలో కూర్చుని చూసే సినిమా ఇది. మిర్యాల రవీంద్ర మంచి టేస్ట ఉన్న నిర్మాతగా నిలిచిపోవాలని నా దగ్గర ప్రస్తావించాడు, అలాగే సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చేశారు. మనకు
ఇలాంటి నిర్మాతలు ఎంతో అవసరం. సినిమాను ప్రేమించేవాళ్లలో రవీందర్రెడ్డిగారు ఒకరు అని చెప్పుకొచ్చారు బోయపాటి శ్రీను.