గత నెల జులై 25 న హాలీడే ట్రిప్ కు స్విస్ కు వెళ్లిన బాలీవుడ్ పెయిర్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ హాలీడేట్రిప్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నారు. కొడుకు తైమూర్ తో స్విస్ లో తెగ ఎంజాయ్ చేసిందట ఈ జంట. రీసెంట్ గా హాలీడేట్రిప్ ముగించుకొని ఇండియా కు చేరుకున్న సైఫ్ దంపతులు ముంబయి ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంటికి చిక్కారు. అంతే.. కెమెరా లు సైఫ్ ఫ్యామిలీని క్లిక్ మనిపించాయి. తైమూర్ ను సైఫ్ ఎత్తుకోగా.. సైఫ్ పక్కనే కరీనా నడుస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక.. హాలీడే ట్రిప్ కూడా ముగియడంతో తమ సినీ జీవితం లో బిజీ అవనున్నారు సైఫ్, కరీనా. సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా నటించిన మూవీ కాలకాండి తర్వాత చెఫ్, బాజార్ మూవీలో నటించనున్నాడు. ఇక.. కరీనా కపూర్ చేతిలో కూడా బోలెడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వీరె ది వెడ్డింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొననుంది. దాని తర్వాత కొన్ని సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.