ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంతో మ‌హేష్‌.. నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫోటోలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 19, 2018, 09:47 AM



టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇటీవ‌లే త‌న ఫ్యామిలీతో విదేశీయాత్ర‌కి వెళ్ళి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన వెంట‌నే త‌న 25వ సినిమా ప‌నుల‌తో బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జ‌రుగుతుంది. చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. అయితే ఉత్తరాఖండ్‌లోనే మ‌హేష్ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. సెట్స్ వద్దకు వెళ్లారు. సీఎం త్రివేంద్ర సింగ్ మహేశ్‌బాబును క‌లిసి స‌ర‌దాగా మాట్లాడారు. హీరోయిన్ పూజా హెగ్డే, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత దిల్ రాజు సీఎంతో క‌లిసి ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com