తెలుగులో సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డిని తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు..తమిళ స్టార్ హీరో తనయుడు ధృవ్ హీరోగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు…. ఈ సినిమాకి బాల దర్శకుడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం శ్రియా శర్మను ఎంపిక చేశారు.. బాలనటిగా చిరంజీవి జై చిరంజీవ, మహేష్ బాబు దూకుడు మూవీలో నటించిన శ్రియా ఆ తర్వాత హీరోయిన్ గా గాయకుడు, నిర్మలా కాన్వెంట్ మూవీలలో నటించింది.. ఈ రెండు మూవీలు ప్లాప్ కావడంతో ఆమె ఇప్పుడు తమిళ పరిశ్రమపై దృష్టి పెట్టింది.. దీంతో వర్మ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.