ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లలితా జ్యూయలర్స్‌ కంపెనీ ఎండీతో అల్లు శిరీష్‌ సెల్ఫీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 03, 2018, 05:01 PM



'సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావు.. లక్‌ ఉండాలి..హా హా' అంటూ సినీనటుడు అల్లు శిరీష్‌ చేసిన ట్వీట్‌ అలరిస్తోంది. 'డబ్బులు ఊరికే రావు' అంటూ లలితా జ్యూయలర్స్‌ కంపెనీ యాడ్‌లో తానే కనపడి ఆకర్షించిన కిరణ్ కుమార్‌ సోషల్ మీడియాలో గుండూ బాస్‌గా ఫేమస్‌ అయిపోయిన విషయం తెలిసిందే. ఆయనను తాను ఓ విమానాశ్రయంలో కలిశానని తెలుపుతూ అల్లు శిరీష్‌ ఈ ట్వీట్‌ చేశాడు. ఓ సెల్ఫీ కావాలని ఆయనను అడిగి తీసుకున్నానని చెబుతూ దాన్ని పోస్ట్‌ చేశాడు. కాగా, శిరీష్‌ నటించిన ‘యుద్ధభూమి’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం విదితమే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com