శశాంక్ కేతన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్..ఇషాన్ కట్టర్ జంటగా నటించిన చిత్రం ‘ధడక్’. ఈ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను జాన్వీ బయటపెట్టింది. తల్లి శ్రీదేవి మీద కోపం వచ్చిన ఓ సంఘటనను ‘ధడక్’ మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా ముందు చెప్పారు. నాకు దాదాపు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, కమల్హాసన్ నటించిన ‘సద్మా’ సినిమాను చూశా. ఈ సినిమాలో కమల్హాసన్ను అమ్మ గుర్తుపట్టలేక పోయిన సన్నివేశం నన్ను కదలించింది. నువ్వు.. కమల్హాసన్ను ఎందుకు గుర్తుపట్టలేదు అని అమ్మతో అలిగి రెండు రోజులు మాట్లాడలేదు. అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా అమ్మ ఎమోషనల్గా నటించిన సినిమాలను నేను చూడను. ఎందుకంటే ఎక్కవగా ఏడ్చే క్యారెక్టర్స్నే అమ్మ చేసింది. కానీ ‘సద్మా’లో అమ్మ ఇంకొకరిని ఏడిపించారని తెలిపింది.