కొద్ది రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకి ఎందరో నిరాశ్రయులయ్యారు. 168 మంది మృత్యువాత పడ్డారు. ఇళ్ళన్నీ నీళ్ళలో కొట్టుకుపోవడంతో తిండి తప్పలు లేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వారికి తనవంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కి మూడు లక్షల విరాళం అందించారు డైరెక్టర్ కొరటాల . కేరళ ప్రజల జీవితాలను పునర్నిర్మించడం మరియు అందమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు వారికి సపోర్ట్గా నిలబడాలని కొరటాల పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మొత్తం 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్క కాసర్ఘడ్ జిల్లాలో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్షిస్తుంది.