ఈ ఏడాది విడుదలైన సినిమాలలో "డీజే టిల్లు" ప్రత్యేకతే వేరు. అతి చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో డీజే టిల్లు సీక్వెల్ పై అంతటా ఆసక్తి నెలకొంది.
ఐతే, ఈ సీక్వెల్ పై ప్రేక్షకులు అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతుంటే, సినిమా మాత్రం హీరోయిన్ విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ముందుగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అన్నారు కానీ, అనుకోకుండా ఆమె డ్రాప్ అవ్వడం, ఆ ప్లేస్ లోకి అనుపమ పరమేశ్వరన్ రావడం వెంటనే జరిగిపోయింది. అంతా సవ్యంగానే జరుగుతుందనుకునే లోపు అనుపమ తప్పుకోవడంతో మళ్ళీ ఈ సినిమా హీరోయిన్ విషయంలో సందిగ్ధత నెలకొంది.
తాజాగా డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ కి జోడీగా హిట్ 2 హీరోయిన్ మీనాక్షి శేషాద్రి నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి మీనాక్షి అయినా ఈ సినిమాలో కంటిన్యూ అవుతుందా? అసలు మీనాక్షి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం నిజమేనా... ? తెలియాల్సి ఉంది.