యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ఇవాళ రామానాయుడు స్టూడియోస్లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే సినిమా ప్రారంభం కానుండటంతో రామానాయుడు స్టూడియోస్లో సందడి నెలకొంది. కార్యక్రమానికి హాజరైన పవన్కు ఎన్టీఆర్ ఎదురెళ్లి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ హాజరయ్యారు.