నేను శైలెజా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మధ్య రికార్డులను కొల్లగొట్టిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర చేసి యాక్టింగ్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' తో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని భావించినా కీర్తికి అంతా రివర్స్ అయింది. ఒక్క మంచి ప్రాజెక్ట్ కూడా లేకపోవడంతో కీర్తి అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. అయితే తాజాగా దగ్గుబాటి రానా కొరియన్ చిత్రానికి సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్నాడు. మాఫియా బ్యాక్ గ్రౌండ్తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నందని రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి బావుంటుందని భావించిన చిత్ర యూనిట్ సంప్రదిస్తే కీర్తి నో చెప్పినట్లుగా సమాచారం.