ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ సినీ నటుడు రాంచరణ్ భార్య ఉపాసన ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించింది. ఇటీవల ప్రధాని మోదీ గాంధీజి 150 వ జయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమం పై చర్చించుటకు బాలీవుడ్ స్టార్స్ ను తన ఇంటికి మోదీ ఆహ్వానించారు. దక్షిణాదిన దిల్ రాజును మాత్రమే ఆహ్వానించారు. మిగతా తెలుగు, తమిళ్,మలయాళం,కన్నడ పరిశ్రమలకు సంబంధించిన ఏ నటునికి కూడా ఆహ్వానం అందలేదు. దీంతో ఉపాసన దక్షిణాది సినీ నటులను నిర్లక్ష్యం చేయడం పై ప్రశ్నిస్తూ మోదీకి ప్రశ్నల వర్షం కురిపించారు.
“మోదీజీ దక్షిణాదిన మీరంటే మాకు ఎంతో గౌరవం. మీరు ప్రధానిగా ఉండటాన్ని మేం గర్విస్తున్నాం. కానీ గొప్ప కార్యక్రమాలు చేపట్టినప్పుడు హింది నటులనే ఎక్కువ భాగస్వాములను చేస్తున్నారు. దక్షిణాది నటులను నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా బాధతో నా మనసులోని భావాన్ని మీకు తెలియజేస్తున్నాను.” అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. ఉపాసన ట్వీట్ ను సమర్ధిస్తూ అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మోదీ తీరును వారు తప్పు పడుతున్నారు.