రాజ్,షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం” చిత్రం ఆడియోను నిర్మాత అమ్మగారైన శ్రీమతి కావాలి సంతోషమ్మ విడుదల చేసారు.. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై నిర్మించిన ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయింది.
ఈ సందర్భంగా హీరో,నిర్మాత అయిన కావాలి రాజ్ మాట్లాడుతూ.ఈ చిత్రం షూటింగ్ టైములో చాల కష్టాలుపడ్డాను మా అమ్మగారు సంతోషమ్మ ఆశీస్సులతో ధైర్యంగా పూర్తిచేయగలిగాను.ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించాం.ఈ చిత్రం చాల అద్భుతంగా వచ్చింది తప్పకుండ విజయం సాధిస్తుందని నమ్మకం తనకుందని అన్నారు. ఈ నెల 22 విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు..చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ‘ఈ సినిమా కి కథే హీరోఅని,. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. సంగీత దర్శకుడు రాజకీరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హీరో రాజ్,హీరోయిన్స్ మేఘన, జరాఖాన్, ,కో డైరెక్టర్ శ్రీరామ్, ఆర్టిస్ట్ కనకదుర్గ అప్పారెడ్డి గూడా గ్రామ పెద్దలు వ్లకే బుచ్చయ్య,చేగూరు రాజు,భవాని శ్రీనివాస్,వ్లకే వెంకటేష్,చెక్కల శ్రీశైలం (షాద్ నగర్) మరియు కేశిరెడ్డి పల్లి గ్రామా పెద్దలు పాల్గొన్నారు.