ఇటీవలే బాలీవుడ్ హాట్ కపుల్..రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణే తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి పెళ్లి రోజు సందర్భంగా తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో గురుద్వారను కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే తిరుమలలో వీరిద్దరి పర్యటన సమయంలోచోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అభిమాని దీపికాకు ‘మేడమ్ ఐలవ్ యూ అంటూ’ తెలిపాడు. ఆతర్వాత పక్కనే ఉన్న ఆమె భర్త రణ్వీర్కు కూడా ఐలవ్ యూ భయ్యా అంటూ... చెప్పాడు. దీంతో వెంటనే కలగజేసుకున్న దీపికా... ‘ బట్ యూ లవ్ మీ మోర్’ అంటూ చమత్కారంగా అభిమానికి తెలిపింది. దీంతో ఈ భార్యభర్తలతో పాటు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు పెళ్లి తర్వాత 83 అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.