టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పూజా హెగ్డేకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దీనితో పూజా హెగ్డే టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. వచ్చే ఏడాది పూజ నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పూజ నటించిన `అల వైకుంఠపురములో..` సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కాబోతోంది. ఇక, అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా పూజ నటిస్తోంది. ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతోంది. అలాగే, ప్రభాస్ చిత్రంలో కూడా పూజ హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇక, ఇటీవల పూజ నటించిన `హౌస్ఫుల్-4` విజయవంతం కావడంతో బాలీవుడ్ నుంచి పూజకు రెండు అవకాశాలు వచ్చాయట. ఆ రెండు చిత్రాలూ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ ఏడాది పూజ నటించిన మూడు చిత్రాలు (మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ఫుల్-4) విడుదలయ్యాయి.