సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ చిత్రం తన సత్తా చాటుతోంది. నిన్న ఒక్కరోజే ఈ సినిమా ఇక్కడ రూ. రెండు కోట్లకి పైగా షేర్ సాధించడం విశేషం. దాంతో ఇంతవరకూ ఈ సినిమా ఇక్కడ 32.1 కోట్ల షేర్ ను సాధించింది. గతంలో ‘మహర్షి’ సినిమా ఇక్కడ రూ. 30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అంతకు మించిన వసూళ్లతో ‘మహర్షి’ రికార్డును ‘సరిలేరు నీకెవ్వరు’ అధిగమించింది. నైజామ్ లో ఈ సినిమా 35 కోట్లకి పైగా షేర్ ను సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు..రష్మిక మందన నటించారు.