కరోనా మహమ్మారిని ఎదుర్కొవటం చాలా సింపుల్ అట. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పెతురాజ్ ఓ సింపుల్ చిట్కాతో కరోనాను అడ్డుకోవచ్చంటోంది. పసుపు.. తులసి.. అల్లం కలిపిన కషాయాన్ని తాగితే ఈ వైరస్ను నిరోధించవచ్చట. ఈ కషాయాన్ని తాగుతున్న ఫోటోను పోస్టు చేసి ఈ క్యాప్షన్ పెట్టింది. ఇదే కనుక నిజమయితే ఇంతమందిని వణికిస్తున్న కరోనా ఇంత చిన్న చిట్కాకు లొంగిపోతుందన్నమాట కాకపోతే చెప్పింది పెద్ద నటి కాదు.అందుకే ఈ చిట్కాను ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదట.