కల్కి రాసిన నవల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మణిరత్నం. ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. విక్రమ్ , కార్తి, జయంరవి, ఐశ్వర్యారాయ్, వంటి వారు చాలా మంది ఉన్నారు. తాజాగా తెలుగు నటి శోభిత కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నదట. ఈ ముద్దుగుమ్మ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘కాంచన’ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’లో హీరోయిన్ గా నటిస్తోంది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో రాణి పాత్రలో నటిస్తోందని సమాచారం. మరి ఈవార్తల పై ఇంతవరకు క్లారిటీ రాలేదు.