కరోనా విభృంభణతో ఎదురవుతున్న సంక్షోభంలో, నిన్నటి వరకు ఏంటి తెలుగు సినిమా హీరోలెవరూ స్పందించడం లేదు.. అలా ఉండిపోయారేంటి అనుకున్నారంతా. కొంతమంది విమర్శలు కూడా చేసారు. కానీ అంతలోనే హీరోలంతా ముందుకొచ్చారు. నితిన్ అందరికంటే ముందు సాయం చేస్తే.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం చేసాడు. కరోనా వైరస్ బాధితుల కోసం ముఖ్యమంత్రుల సహాయనిధితో పాటు ప్రధాన మంత్రి నిధికి కూడా ఈ కోటిని విరాళంగా ఇచ్చాడు చిరు.