దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కానీ లవ్ స్టోరీ మూవీ కథ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరితే దానికి వెంటనే ఒప్పుకున్నాడట శేఖర్. అయితే ఆ సినిమాలో నాగచైతన్య తండ్రి నాగార్జున హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కూడా శేఖర్ కమ్ముల స్టైల్ లోనే ఉండబోతుందట. చూడాలి మరి శేఖర్ కొడుకుతో సినిమా పూర్తికాగానే తండ్రితో సినిమా మొదలు పెడతాడా... లేదా అనేది.