నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపేయగా.. నెక్స్ట్ మూవీ కూడా అదే రేంజ్లో ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు.బోయపాటి స్టయిల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు అమలా పాల్ ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పాత్రకు రాశిఖన్నా, కేథరిన్ వంటి పేర్లు నిన్నటి వరకు వినిపించినా వారెవరూ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా అమల పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.కాగా, లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. ఇప్పుడు మళ్లీ షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, హీరో బాలకృష్ణ మాత్రం మరికొన్నాళ్లు పోయాకనే ఈ షూటింగులో జాయిన్ అవుతారని తెలుస్తోంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం దీనికి ఓ హైలైట్ గా చెప్పుకోవచ్చు.