సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నటి దివ్య చౌక్సే క్యాన్సర్ తో బాధపడుతూ ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న దివ్య క్యాన్సర్ ను జయించడానికి అనేక ప్రయత్నాలే చేశారు. ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన దివ్య నటిగా మంచి పేరు సంపాదించారు. దివ్య చౌక్సే మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం హృదయ విదారక పోస్టు పెట్టారు. ‘‘కేన్సరుతో నేను నెలల తరబడిగా మరణ మంచం మీద ఉన్నాను...దివ్య చౌక్సే బై ’’ అంటూ రాశారు. దివ్య చౌక్సే పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో కనిపించారు. చిన్న వయస్సులోనే ఆమె మరణించడంతో అంతా దిగ్బ్రాంతి చెందారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.నటి దివ్య నవంబర్ 14,1990లో జన్మించారు. చిన్న వయస్సులోనే నటన పై మక్కువతో సినీ రంగంలోకి ప్రవేశించారు. దివ్య 2011 సంవత్సరంలో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్నారు. ‘పాటియలే డి క్వీన్’ తో సాంగ్తో సింగర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దివ్య తండ్రి మోహన్ చోక్సి న్యాయవాది. దివ్య సోదరుడు మయాంక్,సోదరి పల్లవి కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు.