బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం రేగింది. కంగనకు హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో ఓ సొంత ఇల్లు ఉంది. ఆమె తన ఇంట్లో ఉండగా శుక్రవారం రాత్రి ఆ ఇంటి వద్దే కాల్పులు జరిగాయి. దాంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా తెలియలేదు. ఇక ఈ ఘటన పై కంగన స్పందించారు. తొలుత వాటిని తుపాకీ చప్పుళ్లు అనుకోలేదని... రెండోసారి కూడా శబ్దాలు వినిపించడంతో కాల్పులు అనే విషయం అర్థమైందని చెప్పింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్తో, తనను భయపెట్టేందుకే ఇలా చేసి ఉంటారని కంగనా అభిప్రాయపడ్డారు.