బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్య రావడంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. వెంటనే అతనిని ముంబాయి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. సంజయ్ దత్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్ గా తేలింది. శ్వాస సమస్యలే ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కొన్ని గంటల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వారు తెలిపారు. ఇటీవల బాలీవుడ్ లో వరుసగా ప్రముఖులకు కరోనా వచ్చి కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని వారు పూజలు చేస్తున్నారు.