రన్ రాజా రన్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది సీరత్కపూర్. తొలి అడుగులోనే చక్కటి విజయాన్ని అందుకున్న ఆమెకు ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరాలేదు. టాలీవుడ్లో సరైన కమర్షియల్ సక్సెస్ కోసం నిరీక్షిస్తున్న ఈ ఢిల్లీ సొగసరి ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైన ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రంలో ఆధునిక భావాలున్న అమ్మాయిగా చక్కటి నటనను ప్రదర్శించింది. తాజాగా ‘టచ్ చేసి చూడు’ తర్వాత సీరత్కపూర్ మరోసారి రవితేజతో జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..రవితేజ కథానాయకుడిగా రమేష్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో సీరత్కపూర్ ఓ హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. నభానటేష్ మరో నాయికగా నటించబోతున్నది. త్వరలో ఈ సినిమా సెట్స్పైకిరానున్నది. ప్రస్తుతం సీరత్కపూర్ ‘మా వింతగాథవినుమా’ చిత్రంలో నటిస్తోంది.