ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' డ్యాన్స్ షోకి సంబంధించిన కొత్త ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పలువురు కంటెస్టెంట్స్ తమ డ్యాన్స్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ నుంచి 'మగువా మగువా..' పాటకు
ఓ గ్రూప్ చేసిన పెర్ఫామెన్స్తో ఈ 'షో'లో ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతుండగా యాంకర్ రష్మి కన్నీరు పెట్టుకుంది.
సమాజంలో తాను ఓ ఇంటర్వ్యూ చూస్తుండగా ఒకరు మాట్లాడుతూ ఆడవాళ్లు ఎందుకు పనిచేయాలి? అని ప్రశ్నించాడని ఆమె తెలిపింది. అమ్మాయిలు తమ శరీరం కనిపించేలా పొట్టి దుస్తులు ఎందుకు ధరించాలని అన్నాడని చెప్పింది. ఆడవాళ్లు ఇంట్లోనే ఉంటే ఇలాంటివి జరగవని చెప్పాడని తెలిపింది. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలామంది పురుషులు ఇలాగే మాట్లాడారని చెప్పింది. మహిళల పట్ల పురుషుల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో ఆమె తెలిపడం విని రష్మితో పాటు వర్షిణి కూడా కంటతడి పెట్టింది.