హారర్ సిరీస్ ‘ఆరాణ్మణై’తో వరుస విజయాలు అందుకున్నారు తమిళ దర్శకుడు సుందర్ సి. మొదటి రెండు భాగాలు హిట్ అవ్వడంతో మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్య, రాశీఖన్నా జంటగా మూడో చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్స్టూడియోలో రూ. 2 కోట్ల ఖర్చుతో నిర్మించిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను భారీగా తెరకెక్కిస్తున్నారు. ఫైట్మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. వచ్చే ఏడాది వేసవిలో ‘ఆరాణ్మణై 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది.