ఫిబ్రవరి 12న ఉప్పెన చిత్రం రిలీజ్ కానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దేవీ శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు, కృతిశెట్టి, వైష్ణవ్తేజ్ నటన, ఆకట్టుకునే సంభాషణలు ప్రతీ ఒక్కటి సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచడంలో కీ రోల్ పోషించాయి. విజయ్సేతుపతి విలన్గా నటిస్తున్నాడు. మంగళూరు భామ కృతిశెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్కు పరిచయం అవుతుంది.