డైరెక్టర్ తేజ తీసిన మొదటి సినిమా ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. చిత్రం సినిమా ద్వారా హీరో ఉదయ్ కిరణ్ ను తేజ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే తాజాగా తన బర్త్ డే (ఫిబ్రవరి 22న) సందర్భంగా చిత్రం సినిమాకు సీక్వెల్ ఉంటుందని తేజ ప్రకటించాడు. ‘చిత్రం 1.1’ పేరుతో ఆ సినిమా రూపొందించనున్నట్లు.. అంతేకాకుండా ఆ సినిమాను ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకురానున్నట్లుగా ట్వీట్ చేశాడు. అయితే చిత్రం సినిమాకు సంగీతాన్ని అందించిన ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సీక్వెల్ లో 45 మంది కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నట్టు తేజ తెలిపారు.