దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యం పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పెట్రో ధరలపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై సోషల్ మీడియాలో తన దాడిని ఎక్కుపెట్టారు. మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు. మామి రాక్స్’ అంటూ ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలోపెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధరలు దిగొచ్చే అవకాశం ఉందని నిర్మలా గతవారం వ్యాఖ్యానించారు. ధరల అదుపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.