వరుస విజయాలతో దూకుడు మీదున్న సమంతకు అనుకోని చేదు అనుభవం ఎదరైంది. వివరాల్లోకి వెళితే.. సమంత అక్కినేని ఆహా ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. సమంత విషయానికొస్త.. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తూనే సమంత ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేటు కూడా పెరిగింది అంతేకాదు గతేడాది మామ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం వెళితే.. హౌస్ బాధ్యతలను తనపై వేసుకొని ఈ షోను తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది. ఇపుడు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి సామ్ జామ్ ప్రోగ్రామ్కు వన్నె తెచ్చింది. ఎంతో ఆర్భాటంగా ఆహా ఓటీటీలో ప్రసారమైన ‘సామ్ జామ్’ తొలి ట్రైలర్ విడుదల కాగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఐతే.. ఈ షో ప్రారంభమైన తర్వాత ప్రేక్షకులను నుంచి సరైన స్పందన రావడం లేదు. దానికి ఓ రీజన్ ఉంది. ఈ ప్రోగ్రామ్ టీవీ ఛానెల్స్లో ప్రసారం కాకపోవడం ఒక కారణం. మరోవైపు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఓటీటీ గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు.
కేవలం ‘ఆహా’ ఓటీటీ వేదికలో ప్రసారమవుతుండటంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదనే విషయం స్పష్టమవుతుంది. పైగా ‘ఆహా’ ఓటీటీలో సమంత ఇంటర్వ్యూలు చేసే సెలబ్రిటీలు మెగా, అక్కినేని ఫ్యామిలీస్కు సంబంధించిన వాళ్లే ఎక్కువ ఉండటం దీనిపై నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కేవలం సినీ రంగంలో కొంత మంది ఫ్యామిలీ వాళ్లే ఇందులో కనబడుతున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి.