కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ సినీ నటి ఇంట్లో కరోనా విషాదాన్ని నింపింది. "రంగం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పియా బాజ్ పాయ్ సోదరుడు కరోనాతో మృతిచెందాడు. యూపీలోని ఫరూఖాబాద్ జిల్లాలోని కయంగంజ్ బ్లాక్ లో నివసించే తన సోదరుడు కరోనాతో బాధపడుతున్నాడని.. అతనికి బెడ్, వెంటిలేటర్ అత్యవసరం అని, దయచేసి ఎవరైనా సాయం చేయండి అంటూ పియా ట్విటర్ వేదికగా వేడుకుంది. ఇలా ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే 'నా సోదరుడు ఇకలేడు' అంటూ ఆమె మరో ట్వీట్ చేసింది. 'నిన్ను కలిశాక' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పియా.. 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్', 'దళం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.