ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఫోటోలపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ

cinema |  Suryaa Desk  | Published : Wed, May 05, 2021, 09:13 AM



సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి జాన్వీ కపూర్‌. తలుచుకుంటే భారీ బడ్జెట్ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా.. ధడక్ వంటి చిన్న సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ నటనకు ప్రాధాన్య ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకెళుతోంది జాన్వీ. ఇక సినిమాల్లో గ్లామర్ డోస్‌ను కాస్త తక్కువగా ఉండేలా చూసుకునే ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ హాట్‌గా కనిపిస్తుంది. పలు ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోలోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బీచ్ ఒడ్డున దిగిన ఈ ఫొటోల్లో జాన్వీ కాస్త హాట్‌గా కనిపించింది. దీంతో కొందరు నెటిజన్లు.. కరోనా విలయతాండవం చేస్తోన్న ఈ తరుణంలో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడం అవసరమా.? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో ఈ విషయాన్ని గుర్తించిన జాన్వీ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు తీసినవి కావని గతంలో ఎప్పుడో తీసిన ఫొటోలని, ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోషూట్ అంటూ చెప్పుకొచ్చింది. తనను అపార్థం చేసుకున్నారని వాపోయిందీ చిన్నది. ఇక తనకూ సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసని, కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చిందీ బ్యూటీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com